కళ్యాణదుర్గం నియోజకవర్గం సాగునీరు సమస్యపై మంత్రి అనిల్ కుమార్ కి విన్నపించిన ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్


మంగళవారం రోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు అనిల్ కుమార్ ని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ మంత్రితో బీటీపీ ప్రాజెక్టు గురించి అనంతపురం జిల్లా వ్వాప్తంగా కురిసిన వర్షాలు గురించి చర్చించిన అనంతరం కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించే విషయంలో మరింత చొరవ తీసుకొని కాలువ పనులు వేగవంతం అయ్యేలా కృషి చేయాలని కోరారు.

కామెంట్‌లు